హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రతి సీనియర్ ఐపీఎస్ అధికారి అనుభవాలు యువ పోలీసులకు ఎంతగానో మార్గనిర్దేశం చేస్తాయని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు. ప్రతి సీనియర్ పోలీస్ అధికారి తన సర్వీస్ అనుభవాలను పుస్తకరూపంలో పొందుపరచాలని అభిప్రాయపడ్డారు. ఆర్థిక నేరాలకు సంబంధించిన తన అనుభవాలతో ఎస్పీఎఫ్ డీజీ ఉమేశ్ ష్రాఫ్ రాసిన ‘ఎకనమిక్ అఫెన్సెస్-హ్యాండ్బుక్ ఫర్ ఇన్వెస్టిగేషన్’ పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు.
మసబ్ట్యాంక్లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్లో అడిషనల్ డీజీ జితేందర్ అధ్యక్షతన జరిగిన ఈ పుస్తకావిష్కరణలో మాజీ గవర్నర్, రిటైర్డ్ డీజీపీ పీఎస్ రాంమోహన్రావు, రిటైర్డ్ పోలీ స్ అధికారులు ఎంవీ కృష్ణారావు, అరవింద్రావు, సాంబశివరావు, ఉమేశ్ కుమార్, రాజీవ్ త్రివేది, రత్నారెడ్డి, సాంబశివరావుతోపాటు సీనియర్ ఐపీఎస్లు గోవింద్సింగ్, అంజనీకుమార్, శివధర్రెడ్డి, రాజీవ్త్రన్, సంజయ్ జైన్, విజయ్కుమార్, అభిలాష బిష్త్, నాగిరెడ్డి, కమలాసన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేందర్రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా నేరాల స్వభావంలోనూ మా ర్పులు వస్తున్నాయన్నారు. ఉమేశ్ ష్రాఫ్ రాసిన మరో పుస్తకం ‘క్రిమినాలజీ అండ్ క్రైమ్ ప్రివెన్షన్’ను కూడా ఈ కార్యక్రమంలోనే ఆవిష్కరించారు.