హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరికాసేపట్లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 12.55 గంటలకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లోని హెలిప్యాడ్కు సీఎం హెలిక్యాప్టర్ చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.15 గంటలకు కుమ్రంభీం చౌరస్తాకు చేరుకొని, కుమ్రం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పిస్తారు.
మధ్యాహ్నం 1.25 గంటలకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.50 గంటలకు చిల్డ్రన్ పార్క్లో కొట్నాక్ భీంరావ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 2.10 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడు పట్టాలు అందజేస్తారు.
ఆ తర్వాత అక్కడే భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5.05 గంటలకు హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమై 6.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. సాయంత్రం 6.25 గంటలకు ప్రగతి భవన్కు వెళ్తారు. ఆసిఫాబాద్లో జిల్లా పోలీసు అధికారుల భవనాన్ని 51 వేల చదరపు అడుగుల్లో రూ.38.50 కోట్లతో నిర్మించినట్టు తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ తెలిపారు.