కడ్తాల్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాలని, తీజ్ పండుగ గిరిజన మహిళలకు ప్రీతీపాదమైనదని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని గాన్గుమార్ల తండాలో గిరిజనులు నిర్వహించిన తీజ్ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మంత్రి, జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి, జడ్పీ చైర్పర్సన్ గిరిజన మహిళల సంప్రదాయాలను ధరించారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ గిరిజన సంస్కృతికి, సంప్రదాయానికి తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తున్నదని తెలిపారు.
గిరిజన యువతులు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందంగా తీజ్ పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తు జరుపుకునే తీజ్ పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నడం చాలా ఆనందంగా ఉన్నదని మంత్రి అన్నారు. ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ తీజ్ పండుగ సందర్భంగా తొమ్మిద రోజులపాటు గిరిజన యువతులు ఎంతో కఠినంగా దీక్ష చేపడతారని తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడుతూ పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని పేర్కొన్నారు. అనంతరం యువతులు తయారు చేసిన మొలకల బుట్లను మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్, నెత్తిన ఎత్తుకున్నారు. సాయంత్రం యువతులు బుట్టలను ఎత్తుకొని, డప్పుల వాయిద్యాల మధ్య స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
తండాలోని చావిడి వద్ద ఏర్పాటు చేసిన మొలకల బుట్టల పందిరి వద్ద యువతి, యువకులు నృత్యాలతో సందడి చేశారు. అనంతరం స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, గిరిజన సేవా సంఘం రాష్ట్ర నాయకులు సేవ్యానాయక్, లక్పతినాయక్, సర్పంచులు లక్ష్మీనర్సింహారెడ్డి, హంశ్యమోత్యానాయక్, తులసీరాంనాయక్, హరిచంద్నాయక్, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, ప్రియ, మంజూల, ఉప సర్పంచ్ శారద, మహిళాధ్యక్షురాలు వాణీశ్రీ, నాయకులు వీరయ్య, లాయక్అలీ, రాఘవచారి, శ్రీనునాయక్, భీక్యానాయక్, మోత్యానాయక్, శంకర్నాయక్, పాండునాయక్, కిషన్, జగన్, చంద్రు, గోప్య, రూప్సింగ్, తండవాసులు పాల్గొన్నారు.