హైదరాబాద్ : ప్రసుత్త సమయంలో దేశంలో గవర్నర్ వ్యవస్థ అవసరం లేదని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం(Tammineni Veerabadram ) అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ కాలం నాటిదని పేర్కొన్నారు.బీజేపీ(BJP) పాలన లో గవర్నర్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ గా మారిందని దుయ్యబట్టారు.
దేశంలో గవర్నర్లు నేడు రాజకీయ పాత్ర (Politcal Role) పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమిళనాడులో మంత్రి ని తొలగించే అధికారం గవర్నర్కు ఎక్కడిదని ప్రశ్నించారు. మంత్రిని తొలగించే అధికారం సీఎం కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. తమిళనాడు గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన వివరించారు. తెలంగాణ గవర్నర్ కూడా యూనివర్సిటీ బిల్లు ను ఆపి విద్యార్థులకు నష్టం చేస్తుందని ఆరోపించారు. మణిపూర్లో రాజకీయ లబ్ధికోసం బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు.