దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందంటే 1947, ఆగస్టు 15 అని ఠక్కున చెబుతాం. కానీ, ఆరోజే బ్రిటిష్వారు మనకు స్వాతంత్య్రం ఎందుకిచ్చారనే విషయం చాలామందికి తెలియదు.
బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్.. 4 జూలై 1947న భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించింది. ఆ వెంటనే స్వరాజ్యం రాలేదు. బ్రిటన్ పార్లమెంట్ భారతీయులకు పాలన బదిలీచేసే బాధ్యతను చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్కు అప్పగించింది. ఆయన భారతీయులకు అధికారాన్ని అప్పగించేందుకు ఆగస్టు 15వ తేదీని ఎంచుకున్నాడు. ఆ తేదీనే ఎందుకు ఎంచుకున్నాడనే దానికి ఓ కారణముంది. అది రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన రోజు. ఆ విజయానికి రెండో వార్షికోత్సవం నాడు స్వతంత్ర భారత్ ఆవిర్భవించేలా మౌంట్ బాటన్ ప్రణాళిక రూపొందించాడు.