కరోనా సోకిందని ఇంట్లోకి రానివ్వని యజమాని
4 రోజుల క్రితం ఐసొలేషన్ కేంద్రానికి తరలింపు
చికిత్స పొందుతూ బుధవారం మృత్యుఒడికి
జమ్మికుంట, ఏప్రిల్ 14: మానవత్వం లేని ఇంటి యజమాని నిర్వాకంతో కిరాయి ఇంట్లో ఉండే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. కరోనా సోకిందని ఇంట్లోకి రానివ్వకపోవడంతో రెండురోజులపాటు రోడ్డుపై ఓ తోపుడు బండిపైనే అచేతన స్థితిలో ఉండి, తర్వాత దవాఖానలో చేరి తనువుచాలించిన ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బుధవారం జరిగింది. జమ్మికుంటకు చెం దిన సుశీల కూరగాయలు విక్రయిస్తూ జీవిస్తున్నది. ఆమెకు ఇటీవల కరో నా పాజిటివ్ రాగా, ఇంటి యజమాని ఇం ట్లోకి రానివ్వలేదు. దీంతో రెండు రోజులపాటు పట్టణంలోని ఓ తోపుడు బండిపైనే కాళం వెళ్లదీసింది. వైద్యసిబ్బంది ఈ నెల 10న కరీంనగర్లోని ఐసొలేషన్ కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు విడిచింది. ఆమెకు భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నారు.