హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): వైజాగ్ స్టీల్ప్లాంట్ను అమ్మాలనేది బీజేపీ విధానమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ అమ్మకాన్ని ఉపసంహరించేవరకు పోరాడుతామని చెప్పారు.
గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కార్ వచ్చినప్పటినుంచి ప్రైవేటీకరణ చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీని గద్దె దించి దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.