హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం ఈ నెల 16న జారీ చేసిన జీవో 28 అమలును యథాతథస్థితిలో ఉంచాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31న జరిగే విచారణ వరకు స్టేటస్కో ఉత్తర్వులు అమలులో ఉంటాయని తెలిపింది. ప్రభుత్వం తమ వాదనలతో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ పీ మాధవీదేవి శుక్రవారం ఆదేశించారు.
సభ్యులుగా కే కాత్యాయిని, బీ రాజిరెడ్డిని నియమిస్తూ వెలువడిన జీవోను రద్దు చేయాలని కోరుతూ కొండాపురం సరిత పిటిషన్ వేశారు. సభ్యుల నియామకం కోసం నిర్వహించిన రాతపరీక్షల్లో కాత్యాయినికి పిటిషనర్కు ఎకువ మారులు వచ్చాయని, నియామక నిబంధనలను సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయకుండానే వారిని నియమించారని పిటిషనర్ న్యాయవాది వాదన.