హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): మత్స్య రంగంలో మహిళలు రాణించి, ఆర్థిక సాధికారిత సాధించాలని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ పేర్కొన్నారు. సోమవారం యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోకారం గ్రామ మహిళా మత్స్యకారులతో హైదరాబాద్లోని మత్స్య భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయసుగల వారు సొసైటీల్లో సభ్యత్వం నమోదు చేసుకోవాలన్నారు. చేపల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించినట్లు చెప్పారు. గోకారం గ్రామ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళా మత్స్య సహకార సంఘం రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాన్ని కమిటీ నాయకులకు అందజేశారు.