హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎస్సెస్సీ విద్యార్థులకు మే 6 నుంచి 12 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి వెల్లడించారు. మంగళవారం పరీక్షల షెడ్యూల్ను ఆమె విడుదల చేశారు. ఎస్సెస్సీ పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించామని పేర్కొంటూ ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలుంటాయని తెలిపారు. ఉదయం 8 : 30 నుంచి 11 : 45 గంటల వరకు పరీక్షలను నిర్వహించాలని రాధారెడ్డి చెప్పారు.