హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 61,250 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. 19గేట్ల ద్వారా 81,120 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 7,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 1090.7 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ఎస్సారెస్పీ గరిష్ఠ స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 88.662 టీఎంసీలు నిల్వ ఉన్నది.