ఆదిలాబాద్ రూరల్, జూన్ 28: ఆదిలాబాద్కు చెందిన బాకె శ్రీనిధి ఇంటర్ ఫస్టియర్ (బైపీసీ)లో 437/440 మార్కులు సాధించింది. జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు బాకె రఘునాథ్-స్వప్న కూతురు శ్రీనిధి.. కరీంనగర్లోని అల్ఫోర్స్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నది. శ్రీనిధి ఉత్తమ మార్కులు సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. విద్యార్థినిని పలువురు అభినందించారు.