హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థలు రికార్డు సృష్టించాయని అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. ఓపెన్ కోటాలో 1, 10 ర్యాంకులతో పాటు టాప్ 100లోపు 23, అన్ని క్యాటగిరీల్లో 100లోపు 91 ర్యాం కులతో సత్తా చాటినట్టు వెల్లడించారు. 300కు 300 మార్కులతో వెంకట కౌండిన్య ఆలిండియా మొదటి ర్యాంకు, కే సాయినాథ్ శ్రీ మంత్ 10వ ర్యాంకును సొంతం చేసుకున్నట్టు చెప్పారు. మైక్రో షెడ్యూల్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్, ర్యాంకింగ్ సిస్టమ్, ఇన్ఫినిటీ లెర్న్, ఆన్లైన్ యాప్లు, ఫ్యాకల్టీ వల్లే ఇదంతా సాధ్యమైందని వివరించారు. విద్యార్థులు, అధ్యాపక బృందాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బీఎస్రావు అభినందించారు.