హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఐఎన్టీఎస్వో సంస్థ నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు జయభేరి మోగించినట్టు శ్రీచైతన్య స్కూల్స్ డైరెక్టర్ సీమ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలిండియా లెవెల్లో ఐఎన్టీఎస్వో 150 ల్యాప్టాప్లను ప్రకటించగా, 96 (54శాతం) మంది, 750 ట్యాబ్లను ప్రకటించగా అత్యధికంగా 472 (63 శాతం) మంది గెలుచుకున్నట్టు పేర్కొన్నారు. ఐఎన్టీఎస్వో ప్రకటించిన టాప్-5 ర్యాంకుల్లో 58 శాతం, మెడల్స్లో 61 శాతం తమ విద్యార్థులే సాధించినట్టు వెల్లడించారు.