హనుమకొండ, జూలై 17 : నీట్- 2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుత ఫలితాలు సా ధించారు. జాతీయ స్థాయిలో 705/ 720 మార్కులతో జనరల్ క్యాటగిరీలో వీరయ్యగారి సహ్యూ 9వ ర్యాంకు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్ఠను జాతీయస్థాయిలో నిలబెట్టారు. 275 మందికి పైగా విద్యార్థులు మెడిసిన్లో సీట్లు సాధించే ర్యాంకులు సంపాదించారు.
ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ వరదారెడ్డి, మధుకర్రెడ్డి, డైరెక్టర్ సంతోష్రెడ్డి నీట్లో విద్యార్థులు సాధించిన ఈ విజయాలపై హర్షం వ్యక్తంచేశారు. భవిష్యత్తులో మరిన్ని అత్యుత్తమ ర్యాంకులు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. సహ్యు 9వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉన్నదని కళాశాల యాజమాన్యం అభినందించింది. 720 మార్కులకు 705 మార్కులు సాధించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నది.