హనుమకొండ, జూన్ 1 : జేఈఈ అడ్వాన్స్డ్ -2026 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత విజయాలు సాధించి జాతీయ స్థాయిలో ప్రభంజనం సృష్టించి మరోసారి విజయపథాన్ని ఎగుర వేశారని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి అన్నారు. జేఈఈ అడ్వాన్స్ – 2026 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో ఎస్ఆర్ విద్యార్థులు అన్ని క్యాటగిరీల్లో కలిపి జాతీయ స్థాయిలో పీ శ్రీచరణ్ 2వ ర్యాంకు, ఎన్ మైత్రేయి 23వ ర్యాంకు, డీ ఇసాక్ 27వ ర్యాంకు, పీ గౌరీసత్యసాయి స్వరూప్ 88వ ర్యాంకు సాధించి ఎస్ఆర్ కీర్తి ప్రతిష్ఠలను జాతీయ స్థాయిలో నిలబెట్టారు. బీ జీవనసాయి 134వ ర్యాంకు, ఎన్ నిత్యంత్ రెడ్డి 152, ఏ పూనమ్ ముకింద్ 158, ఏ వైష్ణవి 182, వై శ్రీవర్ధన్ 203, బీ రాఘవేందర్ 209, కే అభినవ్ 281, ఎం జస్వంత్ 311వ ర్యాంకు సాధించారు.
ఓపెన్తోపాటు అన్ని క్యాటగిరీల్లో కలిపి జాతీయ స్థాయిలో వరుసగా 349, 386, 399, 430, 438, 486, 521, 683, 690, 705, 820, 830, 917, 919, 952, 970, 986 లాంటి ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోష్రెడ్డి విద్యార్థులను అభినందించారు. 50 ఏండ్లల్లో పటిష్టమైన ప్రణాళికతో హైసూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించేందుకు తమ విద్యాసంస్థలు ఎంతో దోహదం చేస్తున్నాయని తెలిపారు.