హైదరాబాద్ : నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను, వర్క్ ఏజెన్సీలను రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం సెక్రటేరియట్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణం అంతా కలియతిరిగారు. పనులు జరుగుతున్న తీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం విధించిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్క్ చార్ట్ ప్రకారం నిర్మాణ పనులు శరవేగంగా, పూర్తి నాణ్యతతో జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఆర్ అండ్ బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్ఈలు సత్యనారాయణ, లింగారెడ్డి, ఈఈ శశిధర్, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు, ఆర్కిటెక్ట్ లు ఆస్కార్ పొన్ని తదితరులు పాల్గొన్నారు.