హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితాలో నకిలీలు ఏరాల్సిందేనని స్పష్టంచేసింది. రెండు రాష్ట్రాల్లో ఓటు హకు ఉన్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించింది. హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ వంటి పట్టణ ప్రాంతాలకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి లక్షల మంది ఉపాధి కోసం వలస వచ్చారని, వారిలో కొందరు తమ సొంత రాష్ట్రాలతోపాటు ఇకడ కూడా ఓటు హకు కలిగి ఉన్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా స్వచ్ఛతను కాపాడటానికి 15 కీలక సూచనలతో కూడిన ప్రతిపాదనలను ఎన్నికల సంఘం ముందు ఉంచింది.
ఈ మేరకు బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బీఆర్కే భవన్లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్రెడ్డికి మంగళవారం వినతిపత్రాన్ని సమర్పించింది. పార్టీ ప్రతినిధులు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ ప్రధాకార్యదర్శులు రావుల చంద్రశేఖర్రెడ్డి, సోమా భరత్కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్, పార్టీ నేత రవినాయక్లతో కూడిన బృందం ఈ వినతిపత్రాన్ని అందజేసింది. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్లు ఉన్నాయని తాము ఆధారాలతోసహా సీఈవో దృష్టికి తీసుకొచ్చినా అయిన కనీసం చర్యలు తీసుకోలేదని ఆక్షేపించింది. ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. అర్హులైన ఓటర్ల హకులను కాపాడుతూనే, అనర్హులను, నకిలీ ఓట్లను తొలగించినప్పుడే ఈ ప్రక్రియ విజయవంతమవుతుందని, ఈ పవిత్రమైన ప్రక్రియకు ఎన్నికల సంఘానికి తమ పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నది.
బీఆర్ఎస్ అందజేసిన 15 కీలక సూచనలు
కొందరికి నాలుగైదు చోట్లు ఓట్లు: దాసోజు
తమ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు సీఈవో సుదర్శన్రెడ్డిని కలిసి ‘సర్’ ప్రక్రియపై వినతిపత్రం అందజేసినట్టు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ ప్రక్రియలో లోటుపాట్లు, సమస్యలను సీఈవో దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. మంగళవారం సీఈవోకు వినతిపత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ గ్లోబల్ సిటీలో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి ఇకడ నివాసం ఉంటున్నారని, ఇందులో కొందరికి నాలుగు అయిదు చోట్ల ఓట్లు ఉన్నాయని, అది చట్ట వ్యతిరేకమని తెలిపారు. అలాంటి ఓట్లు తొలగించాలని కోరామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే లేఖ రాస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తామని సీఈవో చెప్పారని పేర్కొన్నారు.