బ్రిటన్కు చెందిన లగ్జరీ బైకుల తయారీ సంస్థ ట్రయంఫ్ భారత మార్కెట్లోకి మరో కొత్త బైక్ను లాంచ్ చేసింది. బొన్నెవిల్లే బోబర్ మోడల్ బైక్ను ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా మంగళవారం ఆవిష్కరించింది. సరికొత్త 2021 బొన్నెవిల్లే బోబర్ బైక్ ధర రూ.11.75లక్షలు(ఎక్స్-షోరూం-పాన్ ఇండియా)గా నిర్ణయించారు. గత మోడల్తో పోలిస్తే కొత్త బైక్ లోపల, బయట కొన్ని మార్పులు చేశారు.77 రకాల ట్రయంఫ్ యాక్సెసరీస్లను ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పిస్తోంది.
హై బార్ సెటప్, లగేజ్, సీటీంగ్ ఆప్షన్స్, అడ్జెస్టబుల్ సీటింగ్, ఫూట్పెగ్ పొజిషన్ మొదలైనవి ఇందులో ఉన్నాయి. కొత్త బోబర్ మాట్ స్టోర్మ్ గ్రే, మాట్ ఐరన్ స్టోన్ స్కీమ్, కార్డొవాన్ రెడ్ స్కీమ్, క్లాసిక్ జెట్ బ్లాక్ అనే మూడు కలర్లలో అందుబాటులో ఉంది.