బాన్సువాడ, సెప్టెంబర్ 22 : కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. బీర్కూర్ మండలం సాంబాపూర్ గ్రామస్థులు బీఆర్ఎస్కే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసి శుక్రవారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన స్పీకర్కు ఆ ప్రతిని అందజేశారు. బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి ముదిరాజ్, కుర్మ సంఘం సభ్యులు, బీడీ వర్కర్స్ కుటుంబాలు స్పీకర్ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు బాన్సువాడలో స్పీకర్కు తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి స్పీకర్ చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు.