కొత్తగూడెం క్రైం, చర్ల, ఫిబ్రవరి 21: మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలం ఎర్రబోరు అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఇందులో భాగంగా మావోయిస్టు పార్టీకి చెందిన శబరి ఎల్వోఎస్ కమాండర్ పద్దం కోసయ్య అలియాస్ కొవ్వాసి కోసయ్య అలియాస్ సందీప్ను అరెస్ట్ చేసినట్టు ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న మంగళవారం తెలిపారు. కోసయ్యపై చర్ల పోలీస్ స్టేషన్లో 26 కేసులు, దుమ్ముగూడెంలో ఒక కేసు, ఏపీలో 7, ఛత్తీస్గఢ్లో 8 కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు.