హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏల విలీన సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ట్రెసా కేంద్ర సంఘం విజ్ఞప్తి చేసింది. గురువారం సంఘం ప్రతినిధులు మంత్రిని కలిసి పెండింగ్ సమస్యలను మంత్రికి విన్నవించారు. వివిధ కారణాలతో పోస్టింగ్ ఇవ్వని వీఆర్ఏలకు వెంటనే ఇవ్వాలని కోరారు.
61 ఏండ్లు పైబడిన వీఆర్ఏల కుటుంబసభ్యులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, 55-61 ఏండ్ల మధ్య వయసున్న వీఆర్ఏల వారసులకూ ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇతర శాఖలకు బదలాయించిన వారిని తిరిగి రెవెన్యూ శాఖలో అదే కేడర్లో తీసుకోవాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ త్వరలో అన్ని సమస్యలను అంశాలవారీగా పరిషరిస్తామని హామీ ఇచ్చారని ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ తెలిపారు.