శంషాబాద్, సెప్టెంబర్ 2: బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు స్మగ్లర్లు రోజుకో కొత్త మార్గం ఎంచుకుంటున్నారు. ఫేషియల్ క్రీం, చెప్పుల్లో, బ్లెండర్లో తరలిస్తున్న రూ.24.14 లక్షల విలువైన 495 గ్రాముల బంగారాన్ని గురువారం శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. విమానంలో దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడిపై అనుమానంతో విమానాశ్రయంలో తని ఖీ చేశారు. బంగారాన్ని గుర్తుపట్టకుండా ఫేషియల్ క్రీం, చెప్పులు, బ్లెండర్లో దాచినట్టు గుర్తించారు. బంగారం స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు.