హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్ రూరల్ : దుబాయ్ నుంచి నగరానికి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికురాలిని శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. తనిఖీలలో భాగంగా కస్టమ్స్ అధికారులు ఆమె లోదుస్తుల్లో బంగారం పేస్టును గుర్తించారు. దాంతో అమెను అదుపులోకి తీసుకొని 1614 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ 86.42 లక్షలు ఉంటుందని, దర్యాప్తు చేస్తున్నామని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.