హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం గల మానవ వనరులను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఆరుగురు సభ్యులతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్షిప్ కమిటీ (ఎస్ఎస్డీఈసీ)ని ఏర్పాటుచేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీలో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఈవీ శాఖ డైరెక్టర్ కన్వీనర్గా, పరిశ్రమల శాఖ కమిషనర్, ముఖ్య కార్యనిర్వహణాధికారి(టాస్క్), డైరెక్టర్(ఎంఎస్ఎంఈ), మేనేజింగ్ డైరెక్టర్(సెట్విన్), ముఖ్య కార్యనిర్వహణాధికారి(టామ్కామ్) తదితరులను సభ్యులుగా నియమించారు.