హైదరాబాద్ సిటీబ్యూరో/నాంపల్లి కోర్టులు, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చార్జిషీట్ వేసేందుకు సీసీఎస్ ఆధీనంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిద్ధమవుతున్నది. ఈ కేసులో ఇప్పటి వరకు 107 మందిని సిట్ అరెస్టు చేసింది. న్యూజిలాండ్లో ఉండే ప్రశాంత్రెడ్డి మినహా మిగతా వారందరూ దాదాపుగా ఈ కేసులో అరెస్టయ్యారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్కుమార్ మినహా మిగతా వారందరికీ న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేసింది. కేసుతో సంబంధం లేని ప్రశాంత్రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అతని తరఫు న్యాయవాది గురువారం కోర్టుకు విన్నవించారు.