శాలిగౌరారం: నల్లగొండ జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఒకటైన శాలిగౌరారం ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగు పోస్తున్నది. ఇటీ వల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మూసీ నది పొంగి ప్రవహిస్తున్నది. దీంతో రామన్నపేట మండలం పల్లివాడ వద్ద నిర్మించిన హెడ్వర్క్ వద్ద నుంచి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న శాలిగౌరారం ప్రాజెక్టులో నీరు చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 21అడుగులు కాగా పూర్తిగా నిండి అలుగు పోస్తున్నది.