హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : జియోసైంటిస్ట్స్ అండ్ ఆలైడ్ టెక్నాలజిస్ట్స్ సొసైటీ (ఎస్జీఏటీ) ప్రధానం చేసే ఎక్సలెన్సీ అవార్డుకు ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ సీ మాణిక్యాంబ ఎంపికయ్యారు. ఇనుము, మాంగనీస్, బంగారం, ప్లాటినం సమూ హ మూలకాల ఖనిజ వనరుల అధ్యయనానికి ఆమెకు ఈ అవార్డు వరించింది. ఇప్పటివరకు 130కిపైగా అంతర్జాతీయ జర్నళ్లను ప్రచురించగా, 12 పీహెచ్డీలకు గైడ్గా వ్యవహరించారు. ధార్వాడ్ క్రాటన్, కడప, కృష్ణా-గోదావరి బేసిన్లో మాంగనీస్ వంటి వనరులపై పరిశోధన చేశారు. ప్రస్తుతం జలావరణం, జీవావరణం పరిణామ క్రమానికి సంబంధించిన అంశాలపై మాణిక్యాంబ అధ్యయనం చేస్తున్నారు.