హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సెర్ఫ్ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సెర్ఫ్, ఐకేపీ ఉద్యోగులతో కలిసి పాలాభిషేకం చేశారు.
ఈ విషయంలో సీఎం కేసీఆర్ను ఒప్పించిన మంత్రి చిత్రపటానికి సైతం సెర్ఫ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి.. సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి ఔదార్యాన్ని నేతలు కొనియాడారు. కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ గంగాధర్ రెడ్డి, నర్సయ్య, సుదర్శన్, మధు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఐకేపీ ఉద్యోగులు కలిసి ధన్యవాదాలు తెలిపారు.