హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్జాజు సోమవారం రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధాల మంత్రిత్వశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తెలంగాణ క్యాడర్కు చెందిన 1992-బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు మాజీ కార్యదర్శి అపూర్వచంద్ర, మంత్రిత్వశాఖ, వివిధ మీడియా విభాగాల ఇతర అధికారులు స్వాగతం పలికారు.