హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : శ్రీవారి సర్వదర్శనానికి వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోటా టికెట్లను మంగళవారం ఉదయం 9 గంటలకు టీటీడీ విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి 28 వరకు సంబంధించిన టోకెన్లను అందుబాటులో ఉంచింది. ఈ విషయాన్ని గమనించి ఉచిత దర్శన టోకెన్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.