జోగులాంబ గద్వాల : జిల్లా దవాఖానకు కొవిడ్ చికిత్సకోసం వచ్చే వారికి ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని డీఎంహెచ్వో చందు నాయక్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో కొవిడ్ రోగులకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లలను ఎమ్మెల్యే ఆదేశాల మేరకు సీడ్ ఆర్గనైజర్లు 10 సిలిండర్లను దవాఖానకు అందజేయగా వాటిని ఎమ్మెల్యే డీఎంహెచ్వోకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా దవాఖానకు కొవిడ్ చికిత్స కోసం వచ్చే వారికి ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని చెప్పారు. రోగుల కోసం అవసరమైన ఆక్సిజన్ అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దాన్ని వైద్యులు వినియోగించి కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడాలని సూచించారు.
కార్యక్రమంలో దాతలు రాము ,రాంచంద్రారెడ్డి, గట్టు ఈశ్వరయ్యతో పాటు ఎంపీపీలు విజయ్ కుమార్, ప్రతాప్ గౌడ్ జెడ్పీటీసీ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.