SCR | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొనసాగుతున్న 32 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆయా రైళ్లు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొనసాగుతాయని ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు వివిధ ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు కొనసాగుతాయని పేర్కొంది. ఇక జాబితాలో తిరుపతి-అకోల, పూర్ణ-తిరుపతి, హైదరాబాద్-నర్సాపూర్, తిరుపతి-సికింద్రాబాద్, కాకినాడ టౌన్-లింగంపల్లి, నర్సాపూర్-బెంగళూరు రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లు ఆయా వారాల్లో అందుబాటులో ఉంటాయని.. ప్రయాణికులు ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.