హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థులు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ మరోసారి స్పష్టంచేసింది. ఇప్పటికే స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లను శానిటైజ్ చేశారు. తరగతులు ప్రారంభమైన తర్వాత సైతం నిబంధనల మేరకు శుభ్రం చేయాలని అధికారులు సూచించారు. బడికి వచ్చే ప్రతి విద్యార్థి ఉష్ణోగ్రతను పరిశీలించాలని, జలు బు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉన్నాయేమో పరిశీలించాలన్నారు. ఏవైనా లక్షణాలు ఉన్నా, ఎవరికైనా పాజిటివ్గా తేలినా విద్యార్థులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.