DSC | హైదరాబాద్ : రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్వర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో 2,575 ఎస్జీటీ,1739 స్కూల్ అసిస్టెంట్, భర్తీ చేయనుండగా..మరో వైపు 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.