వనపర్తి: ఆసియా ఖండంలోని మొట్టమొదటి ఆటోమేటిక్ సైఫన్స్ విధానం కలిగిన సరళాసాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో మూడు ఉడ్ సైఫన్స్ తెరచుకున్నాయి. దీంతోపాటు ఒక ప్రైమరీ సైఫన్ కూడా తెరచుకున్నది. గాలి పీడనం ద్వారా నీటిని పీల్చి కిందికి వదలడం సైఫన్స్ ప్రత్యేకత.