హైదరాబాద్ బేగంబజార్లో కుల దురహంకార హత్య జరిగిన విషయం తెలిసిందే. వ్యాపారి నీరజ్ పన్వార్ హత్య విషయంలో భార్య సంజన కుటుంబీకులపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజన తల్లి మధుబాయి స్పందించారు. నీరజ్ పన్వార్ హత్యతో తమ కుటుంబానికి సంబంధం లేదని ప్రకటించారు. తన కూతురు హత్య జరిగిన సమయంలో కుమారుడు, బావ కుమారులు కూడా ఇంట్లోనే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఉదంతం తెలియగానే ఇంట్లోంచి పారిపోయారని ఆమె తెలిపింది.
తన కుమార్తె సంసారాన్ని నాశనం చేశారని, హత్యకు కారకులైన వారిని ఉరి తీయాలని సంజన తల్లి మధుబాయి డిమాండ్ చేశారు. అయితే కొన్ని రోజులుగా అల్లుడు నీరజ్ను చంపుతామని కొందరు బెదిరస్తూ వచ్చారని, వారెవరో మాత్రం తమకు తెలియదని స్పష్టం చేశారు. ఇక సంజన సోదరి మమత కూడా స్పందించింది. ప్రేమ వివాహం ఇష్టలేకే ఏడాది పాటు సంజనతో మాట్లాడకుండా దూరంగా పెట్టామని ఆమె పేర్కొన్నారు.
బేగంబజార్ కులోన్మాద హత్య కేసు.. ఐదుగురు నిందితుల అరెస్ట్