వనపర్తి టౌన్, నవంబర్ 26: ఢిల్లీ కేంద్రంగా సమస్యలపై పోరాడుతూ అమరులైన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్కు సెల్యూట్ చేస్తున్నానని సినీ నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. శుక్రవారం వనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల బాగుకోసం నాటి యూపీఏ ప్రభుత్వం స్వామినాథన్ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ఈ కమిషన్ సిఫారసులను అమలుచేస్తానని అధికారంలోకి వచ్చిన బీజేపీ.. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. రైతు సమస్యలపై తీసిన రైతన్న సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.