లింగాల, ఏప్రిల్ 15: తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే నల్లమలలోని సలేశ్వరం జాతర రెండేండ్ల తర్వాత శుక్రవారం ప్రారంభమైంది. మూడ్రోజులపాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రెండు కొండల మధ్య నుంచి జాలువారుతున్న జలపాతం, సమీపంలోని గుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారికి మొక్కులు చెల్లించుకొన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు అన్నదానం, తాగునీటి వసతి కల్పించాయి. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.