హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోస్టాఫీసుల్లోనే రైతుబంధు నగదును పొందే అవకాశాన్ని పోస్టల్శాఖ కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,794 పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసింది. 2020-21 యాసంగి సీజన్లో 1.73 లక్షల మంది రైతులకు రూ.169 కోట్ల రైతుబంధు నగదును అందించామని పోస్టల్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జే శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం వానకాలం సీజన్లో రైతుబంధు నగదు పంపిణీ కోసం 5,794 చోట్ల మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆధార్, ఫోన్ నంబర్తో లింకైన బ్యాంక్ ఖాతాల నుంచి అన్నదాతలు రైతుబంధు నగదును సులువుగా విత్డ్రా చేసుకోవచ్చని పేర్కొన్నారు.