హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తుతెలంగాణ (ఆర్యూపీపీటీ) కోరింది. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో పరిషత్తు నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు.
పదోన్నతులకు న్యా యపరమైన అడ్డంకులు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఆమెకు వివరించారు. భాషా పండితులకు పదోన్నతుల విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కవితను కలిసిన వారిలో పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్లా, ప్రధానకార్యదర్శి గుళ్లపల్లి తిరుమల కాంతికృష్ణ, రాష్ట్ర సహాధ్యక్షుడు ఘనపురం దేవేందర్, కోశాధికారి శర్మ తదితరులు ఉన్నారు.