హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): హైకోర్టు బార్ అసోసియేషన్కు శుక్రవారం జరిగే ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఓటింగ్ జరిగే ప్రాంతానికి ఓటర్లు కాని వారిని అనుమతించరాదని, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతించాలని కోరారు.