తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం మధిర, మణుగూరు డిపోల వద్ద కార్మికులు, సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
‘వేతనాలు పెంచకపోతే గడ్డి తిని బతకాలా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వీవోఏలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రూ.5 వేల కనీస వేతనంతో, కడుపేదరికంతో నెట్టుకొస్తున్న తమ ఆకలి బాధలు ప్రభుత్వానికి కన్పించడం లేదా?’ అంటూ ప్రశ్నించారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట, కరకగూడెం మండలాల్లో ఆకులు, పచ్చిగడ్డి తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు.