హైదరాబాద్: నగరంలోని అల్వాల్ (Alwal)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని పాల వ్యాను ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందిన వ్యక్తిని మాధవరెడ్డిగా గుర్తించారు. అతడు ఆర్టీసీ డ్రైవర్గా (RTC Driver) పనిచేస్తున్నాడని, బస్సు దిగి రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతునికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.