హైదరాబాద్ : ఐపీఎస్ అధికారి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణను ప్రభుత్వం ఆమోదించింది. ప్రవీణ్కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం విధుల నుంచి రిలీవ్ చేస్తూ నిర్ణయం వెలువరించింది.
26 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసిన ఈ ఐపీఎస్ అధికారి ప్రస్తుతం అడిషనల్ డీజీ ర్యాంక్లో ఉన్నారు. ఇంకా ఆరేండ్ల సర్వీసు ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోమవారం ట్విట్టర్లో వెల్లడించారు. తన నిర్ణయాన్ని ప్రభుత్వ కార్యదర్శికి ఈ మెయిల్ ద్వారా తెలియజేసినట్టు పేర్కొన్నారు. తనపై నమ్మకంతో పలు బాధ్యతలు అప్పగించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
రాజకీయాల్లోకి రావడమా లేదా అన్నది త్వరలోనే ప్రకటించనున్నట్లు ప్రవీణ్కుమార్ తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందాలన్నారు. ప్రవీణ్ కుమార్ ఎవ్వరికీ అమ్ముడుపోడని తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రవీణ్కుమార్ రాజీనామాతో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.