హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రతి గిరిజన గూడేనికి పక్కా బీటీరోడ్డు వేయాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. రా ష్ట్రంలో 12,476 గిరిజన ఆవాసాలున్నాయి. వీటిల్లో ఇప్పటికే 9,440 ఆవాసాలకు బీటీరోడ్లు వేశారు. మిగిలిన 3,036 ఆవాసాలకు వచ్చే మూడేండ్లలో బీటీ రోడ్లు నిర్మించాలని ప్రతిపాదించింది. ఈ ఆవాసాలకు 5,356.44 కిలోమీటర్ల రోడ్లు వేయాల్సి ఉంటుంది. ఇందుకు 1,722.36 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. వచ్చే మూడేండ్లలో దశలవారీగా ఈ రోడ్లు నిర్మిస్తారు. ఉట్నూరు, ఏటూరునాగారం, భద్రాచలం, మన్ననూరు ఐటీడీఏల పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 690 గిరిజన ఆవాస ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 273 గిరిజన ఆవాసాలకు రోడ్లు వేస్తారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి ఫోర్లైన్ రోడ్ల నిర్మాణం పూర్తిచేసింది.
2021-22లో నిర్మించే రోడ్లు