సారంగాపూర్, ఫిబ్రవరి 3: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం గోపాల్పేట్ ఎక్స్ రోడ్ సమీపంలో గల శ్రీసాయి ఆగ్రో ఇండ్రస్ట్రీస్ (రైస్మిల్)ను శనివారం డీసీఎస్వో శ్రీకళ సీజ్ చేశారు.
2022-23 సంవత్సరానికి గాను ఖరీఫ్కు సంబంధించిన 12180 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించిన బియ్యాన్ని రైస్మిల్ యజమాని చిలమంతుల మధుప్రియ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉన్నది. అయితే ధాన్యం తడవడం, యజమాని నిర్లక్ష్యంగా వ్యవహరించి అనుకున్న సమయానికి సీఎమ్మార్ ఇవ్వలేదు. యాజమాన్యం నిర్వాకం వల్ల ప్రభుత్వానికి రూ.1.60 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.