మంచిర్యాల : కరోనా కాలంలో నిలిపివేసిన ఆదిలాబాద్-నీల్వాయి ఎక్స్ ప్రెస్ బస్ పునరుద్ధరణ చేయాలని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్కు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత ఫోన్ చేశారు. ఆదిలాబాద్ నుంచి వేమనపల్లి మండలం నీల్వాయి వరకు నడిచే బస్ ను కరోనా సమయంలో నిలిపి వేశారు. ఈ రూట్లో అన్ని బస్సులు ప్రారంభం అయినా నైట్ హాల్ట్ బస్ లేక పోవడంతో ఆరు నెలలుగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
వివిధ పనుల నిమిత్తం చెన్నూరుకి వచ్చే కోటపల్లి, వేమనపల్లి మండలాల ప్రయాణికులు రాత్రి సమయంలో బస్ లేక ప్రయివేట్ వాహనాలలో అధిక చార్జీలు చెల్లించి ప్రయాణం చేస్తున్నారు.
ఈ విషయాన్ని కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ ఎంపీ వెంకటేశ్ నేత దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎంపీ వెంకటేష్ నేత ఆదిలాబాద్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ కి ఫోన్ చేశారు. సమస్యను వివరించారు. రద్దు అయిన బస్ ను ప్రారంభిస్తామని ఆర్టీసీ డీఎం తెలిపినట్లు ఎంపీపీ వివరించారు.