నందికొండ, జూలై 13 : శ్రీశైలం డ్యామ్కు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండటంతో త్వరలోనే నాగార్జునసాగర్ జలాశయానికి వరద రానున్నందున ఎన్ఎస్పీ అధికారులు ప్రాజెక్ట్ క్రస్ట్గేట్ల నిర్వహణ పనులను ముమ్మరం చేశారు. డ్యామ్ రేడియల్ క్రస్ట్గేట్లకు రూ.50 లక్షలతో డెక్కన్ కంపెనీ రబ్బర్ సీలింగ్ పనులు, రూ.80 లక్షలతో బీకేఎం కంపెనీ క్రస్ట్గేట్ల రోప్ల మార్పిడి పనులు నిర్వహిస్తున్నారు. మొత్తం 26 గేట్లకుగాను 2 గేట్లు మినహాయించి 24 గేట్లకు రబ్బర్ సీలింగ్, 26 గేట్లకు కొత్త రోప్లను అమర్చుతున్నారు. డ్యామ్లోకి వరద వచ్చేలోగా క్రస్ట్గేట్ల నిర్వహణ పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. కుడి కాల్వకు 8 గేట్లు, ఎడమ కాల్వ 3 గేట్లను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు.