హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ (పీజీ) అడ్మిట్కార్డులు విడదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తన అధికారిక వెబ్సైట్లో అడ్మిట్కార్డులను పొందుపరిచింది.
ఈ నెల 11 నుంచి 28 వరకు సీబీటీ పద్ధతిలో సీయూఈటీ పీజీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈసారి 4.6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వివరాలకు https ://pgcuet.samarth.ac. in వెబ్సైట్ను సంప్రదించాలని ఎన్టీఏ పరీక్షల విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాశర్ సూచించారు.